అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి బస్సుల్లో యాత్రికులు వస్తే దానిపై కూడా టీడీపీ నాయకులు గొడవ చేయడం హేయనీయమని మండిపడ్డారు.
తిరుపతి మినహా మిగిలిన చోట్ల ఇలాంటి ఘటనలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఇల్లు ఉందన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు.
కేంద్ర పారా మిలటరీ బలగాలు, వెబ్ కెమెరాల పర్యవేక్షణలోనే పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
రీపోలింగ్కు అనుమతిస్తే ఎన్నికల కమిషన్ తనను తాను అవమానించుకున్నట్లేనని అన్నారు. ఓటమి భయంతో పోలీసులు, అధికారులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి