అమరావతి : ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్యక్రమాలకు రావాలని మెప్మా అధికారి లలితకుమారి డ్వాక్రా సభ్యులకు వాయిస్ మెసేజ్ పంపడమే ఇందుకు నిదర్శమని అన్నారు. లలితకుమారి పంపిన వాయిస్ మెసేజ్ను ఈ సందర్భంగా ఆయన మీడియాకు వినిపించారు. లలితను సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విషయంపై ఎస్ఈసీ, కలెక్టర్, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.