అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీయమని ఆయన అన్నారు. ఓటమి భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు, దౌర్జన్యాలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణయ్, ఎమ్మెల్యే వెలగపూడిని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ నేతల దాడులకు పోలీసులు అండగా నిలవడం హేయనీయమని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.