శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామితోపాటు పరివార దేవతలకు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సాక్షి గణపతికి పంచామృత ఉదకాభిషేకం, పుష్పార్చన, హోమం జరిపించారు.
ఆలయ ప్రాంగణంలోని అఘోర వీరభద్రస్వామికి ప్రదోషకాల షోడశోపచార క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లికాగుండంలోని శుద్ధ జలంతో స్వామివారికి అభిషేకం చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయ అర్చకులు ఏకాంతంగా పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.