అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని గుడివాడలో దారుణం జరిగింది. ప్రభుత్వ సాయంగా వచ్చిన జగనన్న చేయూత డబ్బులను అత్త తన చేతికి ఇవ్వలేదన్న కసితో ఓ కోడలు కిరాతకానికి పాల్పడింది. గుడివాడ పరిధిలోని మందపాడులో నివసించే చుక్కా లక్ష్మి అనే మహిళకు శనివారం ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తున్న జగనన్న చేయూత డబ్బులు వచ్చాయి.
లక్ష్మి కోడలు స్వరూప ఆ డబ్బులు తనకు ఇవ్వాలని అడిగింది. అయితే అత్త లక్ష్మి అందుకు నిరాకరించింది. దాంతో అత్తమీద కోపం పెంచుకున్న కోడలు స్వరూప అదివారం ఉదయం నిద్రపోతున్న అత్తపై వేడి నూనె పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్తను గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి కోడలు స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.