టెల్ అవీవ్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. దాంతో వివిధ దేశాలు తమ ప్రజల రక్షణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తుండగా, మరికొన్ని దేశాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్ల వంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా దేశమంతటా ఒకే నిబంధన అమలు చేయకుండా వైరస్ తీవ్రతను బట్టి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు నిబంధనలు విధిస్తున్నారు.
నిబంధనలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను మాత్రం అన్ని దేశాలు ఒకేలా అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సర్కారు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నది. టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినందున దేశ ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
ఈ మేరకు మాస్కులు తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. అయితే జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించింది. ఇజ్రాయెల్లో ఫైజర్ టీకాలు వేసే ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. 16 ఏండ్లకు పైబడిన వారిలో దాదాపు 81 శాతం మంది టీకా తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వేధించే నోటిపూతకు సులువైన పరిష్కారం
గొంతులో సమస్యా.. ఈ చిట్కా పాటిస్తే చిటికెలో మాయం..!
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో