డియోరియా: ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పోలీసులు పది వేల ఫైన్ వేశారు. మాస్క్ ధరించకుండా అతను రెండోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి భారీ జరిమానా విధించారు. రెండోసారి మాస్క్ ధరించకుండా దొరికితే.. పది వేల జరిమానా విధిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. డియోరియాలోని బరియార్పూర్ పోలీసు సర్కిల్లో అమర్జిత్ యాదవ్ అనే వ్యక్తి వరుసగా రెండు రోజులు మాస్క్ లేకుండా పోలీసులకు చిక్కాడు. ఏప్రిల్ 17వ తేదీన అతనికి వెయ్యి ఫైన్ వేసి మాస్క్ను కూడా ఇచ్చారు. కానీ అతను మళ్లీ మాస్క్ లేకుండా ఏప్రిల్ 18వ తేదీన పోలీసులకు పట్టుబడ్డాడు. లార్ ఏరియా పోలీస్ ఆఫీసర్ టీజే సింగ్ ఆ వ్యక్తికి పదివేల జరిమానా విధించాడు.