రాజ్ కృష్ణ దర్శకత్వంలో నేహాశ్రీ క్రియేషన్స్, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందుతున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఐ సతీష్కుమార్ నిర్మాత. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయిక పాయల్ రాజ్పుత్ క్లాప్నివ్వగా, అలీ కెమెరా స్విఛాన్ చేశారు. సతీష్ వేగేశ్న గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాన్స్, వినోదం అంశాలతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. వినోదమే పరమావధిగా తెరకెక్కిస్తున్నాం. మే ప్రథమార్థంలో షూటింగ్ను ప్రారంభించి నెల రోజుల్లో షూటింగ్ పూర్తిచేస్తాం’ అన్నారు. కొత్తదనాన్ని నమ్మి తాము చేస్తున్న సినిమా ఇదని, ఆర్.పి. పట్నాయక్ సంగీత ప్రధానాకర్షణగా నిలుస్తుందని నిర్మాత పేర్కొన్నారు.