వినాయక్నగర్/నేరేడ్మెట్/గౌతంనగర్/మల్కాజిగిరి, జూలై 8: టీఆర్ఎస్తోనే తెలంగాణలో ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అనిల్కిశోర్, రాజయ్య, ముత్యాలు, సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, ఢిల్లీ పరమేశ్, శివశంకర్, శివ, రఘునాథ్, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్లో.. నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేంకుమార్, డీసీ దశరథ, ఈఈ లక్ష్మణ్, డీఈ సువర్ణ, ఏఈ సృజన, రావుల అంజయ్య, ఉపేందర్రెడ్డి, కరంచంద్, సతీశ్కుమార్, ఎస్ఆర్ ప్రసాద్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గౌతంనగర్లో.. పరిసరాల పరిశుభ్రతపై చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ మేకల సునీత అన్నారు. గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వాణీనగర్, భవానీనగర్, గౌతంనగర్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేకల రాము, ఏఈ దీపక్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మౌలాలిలో…. మౌలాలి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ గున్నాల సునీత ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కిరణ్, సాయిబాబు, శ్రీను, మనోజ్, చింత శేఖర్ పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో.. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారుతున్నాయని ఈస్ట్ ఆనంద్బాగ్ కార్పొరేటర్ ప్రేంకుమార్ అన్నారు. గురువారం వసంతవిహార్ కాలనీలో జరిగిన పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. బీఎస్నగర్లో ఇదిలా ఉండగా మల్కాజిగిరి కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్కుమార్ చింతలబస్తీలో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.