ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్పై అచ్చెన్నాయుడు గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని విజసాయిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు అదే విషయంపై అచ్చెన్న భయపడుతున్నారని అన్నారు.
‘లోకేశ్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు. అగౌరవంగా “వాడు సరిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది” అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా సుకుంటాడేమో అని టెన్షన్ పడుతున్నట్టుంది. పార్టీ ఉండదూ, బొక్కా ఉండదని ఉన్నమాటే అన్నావ్. ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా.’ అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.
‘తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కులంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేసారు. రెండేళ్లు గడిచినా సీఎం జగన్పై ప్రజల విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదని గురుమూర్తి మెజారిటీ స్పష్టం చేసింది. పరాజయం మూటగట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయో.’ అంటూ మరో ట్వీట్లో విమర్శించారు.