అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘టీఆర్ఎస్లో తెలంగాణ టీడీపీ విలీనమైంది, టీడీపీని మూసేశారు. ఏపీ టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాలసిందే. లేకపోతే కృష్ణార్పణమో, గోదావరిలో నిమజ్జనం చేస్తారా? పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రంకు ఇక నిరాశా, నిస్పృహే. చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.
‘జగన్ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీ బాబును, కుల మీడియాను అడుగు మాలోకం. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా. చిన్న మెదడు డ్యామేజి అయినోడివి ఏదైనా అంటావు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టికి నువ్వో ‘పేద్ద’ నాయకుడివి. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే’. అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.