అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని దవాఖానల్లో వరుస విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు దవాఖానల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యాలపై అధికారులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్ను సైతం వీరు దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించారు. గుంటూరు నారాయణ దవాఖాన, విశాఖ ఆరిలోవలోని కుమార్ దవాఖాన, అనంతపురం సాయిరత్న దవాఖాన, జంగారెడ్డిగూడెంలోని ఓ దవాఖానపై కేసు నమోదైనట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.