అమరావతి : అదుపుతప్పి వ్యాన్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం జే కుమరం గ్రామం వద్ద శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
అతి వేగమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి