శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ప్రధానాలయంలోని అఘోర వీరభద్ర స్వామికి ఫలోదకాలు శుద్ధజలాలతోపాటు పంచామృతాభిషేకాలు చేశారు.
అదేవిధంగా పౌర్ణమి సంధ్యా సమయంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి ఊయల సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి అష్టోత్తర నామావళిని అర్చకులు పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున పరిమిత సంఖ్యలో ఆలయ సిబ్బంది సమక్షంలో పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఏఈఓ హరిదాసు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.