తిరుపతి,జూన్ 13: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిదర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎంతో పవిత్రత కలిగిన మహత్తరమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పీయూష్ గోయల్ అన్నారు. ప్రస్తుతం కరోనా ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.