అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన ఇద్దరు యువకులు.. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. సీతానగరంలోని పుష్కరఘాట్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి కృష్ణానది తీరంలో ఇసుక తిన్నెపై కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు యువకులు దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి చేరుకొని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలకం సృష్టించింది.