నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు

విజయవాడ : సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ డివిజన్ సికింద్రాబాద్కు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. నరసాపురం నుంచి సికింద్రాబాద్కు అదేవిధంగా అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ వన్ వే రైళ్లు ఆదివారం ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. ట్రైన్ నంబరు 07460 పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరనుంది. సికింద్రాబాద్కు సోమవారం తెల్లవారుజామున 4.10 గంటలకు చేరుకోనుంది. భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల తదితర స్టేషన్లలో రైలు ఆగనుంది.
అదేవిధంగా ట్రైన్ నంబరు 07461 విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నుంచి ఆదివారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరనుంది. సికింద్రాబాద్కు సోమవారం ఉదయం 8.50 గంటలకు చేరుకోనుంది. తుని, అన్నవరం, సామలకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగనుంది.
తాజావార్తలు
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
- వ్యాట్, సుంకాలెత్తేస్తే పెట్రోల్ చౌక.. కానీ..!!
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- దారుణం : అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడు!
- ఇంటి రుణం రూ.75 లక్షల్లోపు 6.7% వడ్డీ.. దాటితే..!!
- క్షమించండి.. అంటూ చెవులు పట్టుకుని బస్కీలు తీసిన నేత
- వీడియో : భోజనం భారత్లో.. నిద్ర మయన్మార్లో