అమరావతి : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. వివరాలివి.. శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి గ్రామానికి చెందిన దేవిశ్రీ (12), శిల్ప (10) అవ్వతో కలిసి ఈ ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లారు. శివారులోని చెరువు వద్ద గొర్రెలను మేపుతూ ఆడుకుంటూ వెళ్లి చెరువులో జారిపడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఊహించని ప్రమాదంలో పిల్లలిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.