తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవస్థానమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఈ నెల 13, 16వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే జూలై నెలకు సంబంధించిన టికెట్లు రోజుకు ఐదు వేల చొప్పున విడుదల చేసింది. అయితే ఈ రెండు రోజులకు సంబంధించిన టికెట్లను అప్పడు విడుదల చేయలేదు. తాజాగా వాటిని కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.