తిరుమల: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఆలయాలు భక్తుల దర్శనాలను నిలిపివేశాయి. తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మహమ్మారి ఉధృతి దృష్ట్యా శ్రీవారి దర్శనాల సంఖ్యను తగ్గించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల జారీని పాలకమండలి రద్దు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 30 వేల నుంచి 15 వేలకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. రూ.300 దర్శన టికెట్లను ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..