మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు
హసన్పర్తి, ఏప్రిల్ 28 : టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల మాటలు నమ్మవద్దని, టీఆర్ఎస్ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి జక్కుల రజితను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు కోరారు. 55వ డివిజన్ భీమారంలోని డీవీఆర్ గార్డెన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల క్రితం టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులను టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బాలమల్లు సస్పెండ్ చేశారని చెప్పారు. 55 డివిజన్లోని రెబల్ అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ పార్టీయేనని ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా నాయకుడు సంగాల విక్టర్బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు రాయికంటి సురేశ్, ఎర్రగటుగుట్ట ఆలయ మాజీ చైర్మన్ అటికం రవీందర్, నాయకలు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు జక్కుల విజయ్కుమార్, దేశిని వీరస్వామి, సంగాల శ్రీనివాస్, ముచ్చు వెంకటస్వామి పాల్గొన్నారు.