తిరుపతి, మే3: తిరుమలతిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయం లోపల ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు మే 17వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.