ముంబై, జూలై 9: ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,807గా నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22లో భాగంగా జారీ అవుతున్న బాండ్ల ఇష్యూల్లో ఇది నాల్గవ సిరీస్. ఈ బాండ్లకు జూలై 12 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతో పాటు డిజిటల్ రూపంలో ఇష్యూకు చెల్లింపులు జరిపే ఇన్వెస్టర్లకు గ్రాముపై రూ.50 చొప్పున డిస్కౌంట్ ఉంటుంది.