అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) సమావేశం చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో ప్రారంభమైంది. సమావేశానికి టీటీడీ ఈఓ జవహార్రెడ్డితోపాటు ఎక్స్అఫీషియో సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి ఎమ్మెల్యే), భూమన కరుణాకర్ రెడ్డి (తిరుపతి ఎమ్మెల్యే) హాజరయ్యారు. తిరుపతిలోని గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ధాన్యంతో స్వామివారికి నిరంతరాయంగా నైవేద్యం అందించాలన్న ప్రతిపాదనపైనా సమావేశంలో చర్చించనున్నారు.