నేడు మండలంగా ఆవిర్భవించనున్న మాసాయిపేట
ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
వెల్దుర్తి, ఏప్రిల్ 6: తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన మాసాయిపేట గ్రామం నేడు మంత్రి హరీష్రావు చేతులమీదుగా మండల కేంద్రంగా ఆవిర్భవించనుంది. గ్రామంలో నుండి జాతీయ రహదారితో పాటు రైల్వేలైన్, రైల్వే స్టేషన్ ఉండడంతో మాసాయిపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కేంద్రంగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో జాతీయ రహదారి దిగ్భందం, రాస్తారోకో, ధర్నాలు, రైల్రోకో వంటి కార్యక్రమాలకు మాసాయిపేట కేంద్రంగా నిలిచింది. అన్ని అర్హతలు ఉన్న మాసాయిపేటను మండల కేంద్రం చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నూతన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన మండలాలను ఏర్పాటు చేయడంతో మాసాయిపేట మండల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సాధన సమితి నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మాసాయిపేటను మండల కేంద్రం చేస్తూ 1 జూలై, 2020న నోటిఫికేషన్ను విడుదల చేసిన ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో 24 డిసెంబర్, 2020 మండల కేంద్రం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది.
తొమ్మిది రెవిన్యూ గ్రామాలతో మండలం ఏర్పాటు
మాసాయిపేట మండల కేంద్రం ఏర్పాటు కోసం వెల్దుర్తి మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలు, చేగుంట మం డలంలోని మూడు రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాన్ని ఏర్పాటు చేశారు. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట, రామంతాపూర్, అచ్చంపేట, హక్కీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి, చేగుంట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి, పోతన్పల్లి, పోతంశెట్పల్లి తొమ్మిది రెవెన్యూ గ్రామాల పరిధిలోని 14 గ్రామపంచాయతీలతో మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. 9 రెవెన్యూ గ్రామాల పరిధిలో 14733 జానాభా ఉంది.
మంత్రి చేతుల మీదుగా కార్యాలయాల ప్రారంభం..
మంత్రి హరీశ్రావు చేతులమీదుగా నేడు నూతన మండల కేంద్రం మాసాయిపేటలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. పాత పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన తహసీల్ కార్యాలయం, పాత వెటర్నరీ ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన పోలీస్స్టేషన్తో పాటు రైతువేదికను మంత్రి ప్రారంభించనున్నా రు.అంతకుముందు స్థానిక సాయిబాబా, రుక్మిణీ పాండు రంగస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు సర్పంచ్ మధుసూదన్రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని హస్తాల్పూర్, బండపోసాన్పల్లి గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలను సైతం మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్తో బోలెడు బెనిఫిట్లు!
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో