కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టితోనే పట్టణాలు సర్వాంగ సుందరం
మంథని అభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తున్న పుట్ట దంపతులు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
మంథని టౌన్, ఏప్రిల్ 6: స్వరాష్ట్రంలో పట్టణ, పల్లె ప్రగతితో సీఎం కేసీఆర్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పట్టణ ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని పేర్కొన్నారు. మంథని మున్సిపాలిటీకి ప్రభు త్వం మంజూరు చేసిన స్వచ్ఛ ఆటోలను పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతకాని, జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి మంత్రి మంథనిలో ప్రారంభించారు. పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. ఒక్క కరీంనగర్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, మంథని లాంటి కొత్త మున్సిపాలిటీకి ఇప్పటికే రూ.15 కోట్లు ఇచ్చిందని, మరో రూ.15కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీలో దేవాలయం మినహా ఇతర అభివృద్ధి పనులకు రూ.30కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశా రు. రామగుండం, పెద్దపల్లి, కోరుట్ల, మెట్పల్లి,ధర్మపురి పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నదన్నారు.
మంథని ప్రాంత అభివృద్ధి కోసం పుట్ట మధూకర్, పుట్ట శైలజ ప్రత్యేకంగా శ్రమిస్తున్నారన్నారు. పెద్దపల్లి-కాటా రం, గోదావరిఖని-మంథని ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం పుట్ట మధూకర్ ఎండీఎఫ్ నిధుల నుంచి రూ.123కోట్లను ప్రభు త్వం నుంచి మంజూరు చేయించడం అద్భుతమన్నారు. మంథని మున్సిపాలిటీని అభివృ ద్ధి చేసేందుకు చైర్పర్సన్ పుట్ట శైలజ ప్రత్యేక శ్రద్ధతో పనిచేయడం అభినందనీయమన్నా రు. పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్ మా ట్లాడుతూ, ప్రస్తుతం మున్సిపాలిటీని అభివృ ద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ, మంథని నియోజకవర్గ, మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ తమ జీవితాలను అంకితం చేశారన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి, మున్సిపల్ వైస్చైర్మన్ ఆరెపల్లి కుమార్, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, కౌన్సిలర్లు వీకే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, శ్రీపతి బానయ్య, కుర్రు లింగయ్య, కాయితి సమ్మయ్య, కో-ఆప్షన్ సభ్యుడు యాకుబ్, టీఆర్ఎస్ నాయకులు బత్తుల సత్యనారాయణ, ఎగోలపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.