అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ మందకొడిగానే సాగింది.
ఒంటిగంట వరకు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 36.67 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా సూళ్లూరు పేట నియోజకవర్గంలో 40.76 శాతం, అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 32.13 శాతం పోలింగ్ జరిగింది.
సరేపల్లి నియోజకవర్గంలో 38.10 శాతం, గూడూరు నియోజకవర్గంలో 36.84 శాతం, వెంకటగిరి నియెజకవర్గంలో 37.63 శాతం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 35.98 శాతం, సత్యవేడు నియోజకవర్గంలో 36 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఎండ, కరోనా తీవ్రత కారణంగా ఓటర్లు చాలామంది ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించకపోవడంతో పోలింగ్ శాతం తగ్గే అవకాశం కనిపిస్తున్నది.
సాయంత్రం 7 గంటల వరుకు పోలింగ్ కొనసాగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి