అమరావతి : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.
సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తామని ప్రకటించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రద్దీని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందూ. నిత్యం 3 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి