విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రాథమిక సమాచారం. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగర్ మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది.
పది ఎకరాల్లో రూ.26 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం గావించారు. మహా సంప్రోక్షణ, ఇతర పూజాది కార్యక్రమాలు ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం వలె ఇక్కడి ఆలయాన్ని నిర్మించారు. వెంకటేశ్వరస్వామి వారికి ఎదురుగా హనుమాన్ విగ్రహాం కొలువుదీరింది. అదేవిధంగా శ్రీదేవి, భూదేవి ఆలయాలను స్వామి ఆలయానికి పక్కనే నిర్మించారు. ఓ ధ్యాన మందిరం, వివాహాల కోసం బ్యాంకట్ హాల్ను ఏర్పాటు చేశారు. సందర్శకుల సౌకర్యార్థం బీచ్ రోడ్ నుండి టెంపుల్ వరకు ఘాట్ రోడ్ను నిర్మించారు. తిరుమల ప్రధాన ఆలయం వలె ఇక్కడా అన్ని పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి.