ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కొనసాగుతున్న భరోసా యాత్ర
జ్యోతినగర్, మే 20: కరోనా బాధితులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎమ్మె ల్యే భరోసాయాత్రలో భాగంగా ఎన్టీపీసీలోని ఐదో డివిజన్లో కరోనా బాధితుల ఇంటికి చందర్ వెళ్లి ఆత్మీయంగా పలుకరించి, వారికి నిత్యావసరాలు, పండ్లు, పౌష్టికాహారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో కరోనా కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని వివరించారు. ఇండ్లలో ఉండలేని బాధితులకు కేర్ సెంటర్లో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మూడు పూటలు భోజనం అందిస్తున్నామని, అంబులెన్స్ వసతి, కరోనా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ మేయర్ బింగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్ కల్వచర్ల క్రిష్ణవేణి ఉన్నారు.
ఫర్టిలైజర్సిటీ, మే 20: రామగుండం 14వ డివిజన్లో కరోనా బాధితులకు ఎమ్మెల్యే మనోధైర్యం కల్పించేందుకు భరోసా యాత్ర చేపట్టారు. నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇక్కడ కార్పొరేటర్ నీల పద్మగణేశ్ ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
గోదావరిఖని, మే 20: కరోనాపై కూరగాయల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. గోదావరిఖని సీతానగర్ ఏరియాలోని కూరగాయల మార్కెట్ను గురువారం చందర్, సీపీ సత్యనారాయణతో కలిసి లాక్డౌన్ అమలు విధానం పర్యవేక్షించి వ్యాపారులకు లాక్డౌన్ నిబంధనలు, కరోనా వ్యాప్తి నివారణ విషయంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్నారు. మార్కెట్ చిన్నగా ఉన్న కారణంగా గతంలో మాదిరిగానే జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి తరలిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, వన్ టౌన్ సీఐ రమేశ్బాబు, రాజ్కుమార్, ప్రవీణ్కుమార్, లక్ష్మీనారాయణ ఉన్నారు.