అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. జిల్లాలోని గార మండలం బందరువానిపేటలో ఈ ఘటన చోసుకున్నది. సమాచారం అందుకున్న అధికారులు.. స్థానిక జాలర్లతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారిలో జాలరి గణేశ్ మృతదేహం లభించగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.