అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్పై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని గుంటూరులోని జీజీహెచ్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి