తిరుమల,జూన్ 9: తిరుమలలోని శ్రీవారి మెట్టు దగ్గర రాతితో ఉన్న శంఖుచక్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సమాచారం అందుకున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. శ్రీవారి మెట్టు దగ్గర ఏడేండ్ల క్రితం కొందరు వ్యక్తులు రాతితో తయారు చేసిన శ్రీవారి నామం, శంఖు చక్రాలు ఏర్పాటు చేశారు. కాలి నడకన వెళ్లే భక్తులు నాటి నుంచి శ్రీవారి నామం, శంఖు చక్రాలకు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు శంఖు చక్రాలు మాయంకావడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.