డెహ్రాడూన్: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం మూతపడింది. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు మూసి ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. మే 3 మూడు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటామని వెల్లడించింది. కాగా, డెహ్రాడూన్, పౌరీ గగర్హ్వాల్ జిల్లాలో గత కొన్నిరోజులుగా భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. దీంతో డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలతోపాటు, పౌరీ గర్హ్వాల్ జిల్లాలోని కొట్ద్వార్, స్వర్గ్ ఆశ్రమ్ ప్రాంతాల్లో నేటి నుంచి కర్ఫ్యూ అమలుచేస్తున్నది. ఇది వారంరోజులపాటు అంటే మే 3 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో 33.69 శాతం ఈ జిల్లాలోనే ఉంటున్నాయి. ఉత్తరాఖండ్లో 35,864 కేసులు యాక్టివ్గా ఉండగా అందులో 12,084 డెహ్రాడూన్కు చెందినవే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..