హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నమోదుకు వెబ్సైట్ పనిచేయలేదు. అక్టోబర్కు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. అయితే భక్తుల పెద్దసంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించడంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది.
కాగా, టీటీడీ వెబ్సైట్లో తరచూ సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. టీటీడీ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వ సర్వర్ను ఉపయోగించుకుంది. అయితే సమస్య తలెత్తడంతో ప్రస్తుతం జియో సర్వర్ ద్వారా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటీకీ సమస్య పరిష్కారం కాకపోవడం గమనార్హం.