చేగుంట, జూలై 1 : తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పిలుపునిచ్చారు. చేగుంట మండలం వడియారంలో నర్సరీని ఆయన సందర్శించారు. అనంతరం పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్లో కలిసి చిన్నశివునూర్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, ప్రత్యేకాధికారి జయరాజ్, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈనెల 23 నుంచి ఒలింపిక్ క్రీడలు..
మెదక్, జూలై 1 : 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్ క్రీడలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడి తిరిగి ఈనెల 23 నుంచి టోక్యోలో ప్రారంభంకానున్నాయని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఒలింపిక్ క్రీడలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం మోడల్ సెల్ఫీ పాయింట్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ మన దేశం తరఫున ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించనున్న క్రీడాకారులు గతంలో కంటే ఎక్కువ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి నాగరాజు, డీఈవో రమేశ్కుమార్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీశ్, ఆర్డీవో సాయిరాం, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బి.శివశంకర్రావు, పీఈటీలు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం..