అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం నెల్లూర్ జిల్లా పొదలకూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలంటూ మరికాసేపట్లో పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
చంద్రబాబు రాక దృష్ట్యా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూల్లూరుపేట నియోజకవర్గాలున్నాయి.
ఇవాళ సర్వేపల్లిలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు, ఈ నెల 10న సూళ్లూరు పేటలో, 11న వెంకటగిరి, 12న సత్యవేడు, 13 గూడూరులో ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ నెల 14న తిరుపతిలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే రోజు తిరుపతిలో సీఎం జగన్ ప్రచారం సైతం ఉండనున్నట్లు సమాచారం.
దీంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. సభలను విజయవంతం చేసేందుకు ఇరు పార్టీల నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటు సీఎం జగన్.. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలు ఒకే రోజుల ఉండటంతో శాంతిభద్రలకు విఘాతం కలగకుండా తిరుపతిలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి