మల్లాపూర్, జూలై 12 : శ్మశాన వాటికల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్మశానవాటికలో వాటర్ ఫౌంటేన్లో శివుని విగ్రహం, దహనవాటికలు, వెయిటింగ్ హాళ్లు, సత్య హరిచ్ఛంద్రుని విగ్రహం, ప్రవేశమార్గాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే.. కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, అధికారులతో కలిసి సోమవారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న శ్మశానవాటికల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, డీఈ రూప, ఏఈ వేణు, టీపీఎస్, సరిత, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్రెడ్డి, నాచారం సీఐ కిరణ్కుమార్, రెవెన్యూ సిబ్బంది వనిత,నరేందర్, బీసీ కులాల ఐక్యవేదిక సభ్యులు,టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.