అమరావతి : ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల నడిగడ్డ సమీపంలోని మల్దార్పేటలో శేఖర్, కళావతి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు అంజని, అఖిలతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అయితే, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.