శ్రీశైలం : రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో గతంలో దర్శన సమయాన్ని కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు మాత్రమే అనుమతించారు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు దర్శన సమయాన్ని అదనంగా మరో రెండు గంటలు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఈ క్రమంలో వసతుల కల్పనకు సైతం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. భక్తులకు కేవలం స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.