శ్రీశైలం : కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 876 అడుగుల చేరింది. ఎగువ నుంచి 1.5 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో వస్తున్నది. ఇన్ఫ్లో ఇలానే కొనసాగితే మరో 24 గంటల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికి గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.6615 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండటంతో కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వానికి అనుమతించింది. ఓ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్కో సీఈ సుధీర్ బాబు వెల్లడించారు.
Viveka Murder Case : అనుమానితులందరినీ విచారిస్తున్న సీబీఐ
కడప జిల్లాలో దారుణం : సర్పంచ్ను నరికి చంపిన ప్రత్యర్థులు
ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు