అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శన వేళలు మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామని దేవస్థానం స్పష్టం చేసింది. రాహు- కేతు- సర్పదోష నివారణ పూజలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పెద్దరాజు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.