అమరావతి : తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అందరికీ వ్యాక్సిన్ వేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి నాలుగైదు రోజులపాటు ఉద్యోగులకు వ్యాక్సిన్ అందించనున్నారు. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. నిన్న శ్రీవారిని 13,918 మంది భక్తులు దర్శించుకోగా, 5,952 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.1.15 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.