అమరావతి : ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.
బస్సులో ప్రయాణిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి