కరోనా సెకండ్ వేవ్తో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కేసుల పెరుగుదల దృష్ట్యా పెద్ద, చిన్న హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ ఈ నేపథ్యంలో మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాల విడుదల విషయమై పలువురు దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఓటీటీ కంపెనీలు చిన్న హీరోల సినిమాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదట.
బ్రాండ్ వాల్యూ ఉన్న స్టార్ హీరోల చిత్రాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా వెంకటేశ్ నటించిన దృశ్యం 2 ప్రాజెక్టుపై ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కన్ను పడిందట. మలయాళంలో మోహన్ లాల్, మీనా కాంబోలో వచ్చిన దృశ్యం2కు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాగా..మంచి టాక్ వచ్చింది. దీంతో వెంకీ సినిమాను కూడా మంచి ఆఫర్ తో డిజిటల్ ప్లాట్ఫాంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఇన్సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…