కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగడం, 200కుపైగా స్థానాల్లో ఆ పార్టీ లీడ్లో ఉండటంతో మమతా బెనర్జీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగాల్ పులి’కి అభినందనలు అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఓ దీదీ, దీదీ ఓ దీదీ.. అని అభివర్ణించారు.
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీని ప్రధాని మోదీ ఈ విధంగా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మమత విజయాన్ని కొనియాడుతూ సంజయ్ రౌత్, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు ఈ మేరకు మోదీకి కౌంటర్ ఇచ్చారు.
మమతా బెనర్జీ స్పష్టమైన సందేశాన్ని పంపారని సంజయ్ రౌత్ కొనియాడారు. మోడీ, అమిత్ షా అజేయులు కాదని, వారు కూడా ఓడిపోవచ్చని బెంగాల్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తున్నదని పేర్కొన్నారు.