తిరుమల, మే 29: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమల శ్రీవారికి విరాళంగా అందాయి. టీటీడీ ఛైర్మన్ వై. వి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శివకుమార్, శేఖర్ రెడ్డి, కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు విజయరామ్ కలిసి ఈ విరాళాన్ని అందించారు. దాతల తరఫున వారి ప్రతినిధి ఈ మేరకు విరాళాన్ని శ్రీవారి ఆలయం వద్ద ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్కు అందజేశారు. ఇందులో 25 కిలోల పసుపును తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అందించాలని దాతలు కోరారు.