అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు వద్ద విధించిన మొదటి ప్రమాద హెచ్చరికను నీటిపారుదల శాఖాధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజ్ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది. 10,500 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు , 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 15 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.94 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా స్పిల్వే ద్వారా 3.76 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.
జలాశ యం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.40 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 215. 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది.