ఎస్ఈసీ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగబద్ధ పదవిని అడ్డుపెట్టుకొని అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. టీడీపీ లబ్ధి చేకూరేలా ఎస్ఈసీ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇద్దరి డీఎన్ఏ ఒక్కటేనని మండిపడ్డారు.
ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నసాకుతో బదిలీ చేసిన అధికారుల సర్వీస్ రిజిస్టర్లో రిమార్కులు చేర్చాలని డీవోపీటీకి లేఖ రాయడం సరికాదని పేర్కొన్నారు. కొత్త ఓటరు జాబితాలో ఇప్పట్లో ఎన్నికలు కుదరవని ఎస్ఈసీ భావించారని, తాను తప్పుకునేందుకు ఉద్యోగులపై తప్పు నెట్టి లేఖ రాశారని రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు. మార్చిలోపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడ్డగోలు చర్యలను ప్రభుత్వం తిప్పి కొడుతుందని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ
- చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు : మంత్రి కేటీఆర్
- మెగా హీరో షేర్ చేసిన క్యూట్ పిక్.. నెట్టింట చక్కర్లు