రామంతాపూర్, జూన్ 30 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను పరిశుభ్రంగా ఉంచాలన్నదే లక్ష్యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డ్రైనేజీ, దోమల నివారణ, తాగునీటి సమస్య పరిష్కారం, ఎలక్ట్రిసిటీ స్తంభాల ఏర్పాటు, వీధిలైట్ల ఏర్పాటు, వైకుంఠధామాల్లో పరిశుభ్రత, పచ్ఛదనంపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ప్రతి డివిజన్ను పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. రహదారులు, రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్ కార్పొరేటర్లు రజితా, బన్నాల గీత, చేతన, శ్రీవాణి, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎంటమాలజీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ పబ్లిక్ స్కూల్లో బుధవారం విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా విద్యాభ్యాసం ఆన్లైన్ ద్వారా కొనసాగుతున్నదని, దీంతో విద్యార్థులు విద్యకు దూరంకాకుండా ఉండేందుకు స్కూల్ యాజమాన్యం ట్యాబ్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ సహకారంతో మంజూరైన 290 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.